CM Revanth in Chevella Sabha | నువ్వు వస్తవో, నీ అయ్య వస్తడో రండి.. రేవంత్ రెడ్డి సవాల్
28 February 2024, 9:40 IST
- రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలిచి చూపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. KCR,KTRపై మండిపడ్డారు. పదేళ్ల అడవిపందుల్లాగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అన్నారు. అందుకే వాళ్లను ప్రజలు చెప్పుతో కొట్టారని, అయినా వాళ్లకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పడిపోతదంటూ BRS నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.