తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu | ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. తెల్లవారు జామున సైతం జనం

Chandrababu | ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. తెల్లవారు జామున సైతం జనం

01 November 2023, 10:00 IST

  • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం ఇంటికి బయలుదేరిన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. 200 కిలోమీటర్లు దారి పొడవునా, చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పట్టారు. అడుగడుగునా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడక్కడ అడ్డుకున్నా పట్టించుకోలేదు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం పెద్ద ఎత్తున జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం వద్ద నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి విజయవాడకు దాదాపు 14 గంటల నిర్విరామ ప్రయాణం చేశారు చంద్రబాబు.