కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ఫార్మసీ విద్యార్థి మృతి
08 March 2023, 18:26 IST
- గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఎక్కడి వాళ్లక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. తాజాగా అనంతపురుంలో బీ ఫార్మసీ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 19 ఏళ్ల వయసు ఉన్న ఓ విద్యార్థి కబడ్డీ ఆడుతూ గ్రౌండ్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురంలోని పీవీపీకే కళాశాలలో తునూజ నాయక్ బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీన కాళాశాల గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతూ.. తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పతత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తనూజ నాయక్ ఈ రోజు తుదిశ్వాస విడిచాడు.