తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  West Bengal: G20 సమ్మిట్ విజయవంతం కోసం ఆ రాష్ట్ర గవర్నర్ పూజలు

West Bengal: G20 సమ్మిట్ విజయవంతం కోసం ఆ రాష్ట్ర గవర్నర్ పూజలు

08 September 2023, 11:21 IST

  • రేపు ప్రారంభం కాబోయే జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ మహానగరం సరికొత్తగా మెరిసిపోతోంది. కలర్‌ఫుల్ లైట్లు, త్రీడీ ప్రదర్శనలు, వివిధ దేశాల జెండాలు, స్వాగత తోరణాలు అల్లుకున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉన్న భారత్ మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరోవైపు ఈ సమ్మిట్ విజయవంతం కావాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రార్థనలు చేశారు. కోల్‌కతాలోని బాబు ఘాట్‌కు చేరుకుని ఈ ప్రార్థనలు చేశారు. G20 విజయం, భారతదేశ విజయం, పశ్చిమ బెంగాల్ విజయం కోసం ప్రార్థించేందుకు ఈ హారతి నిర్వహించామన్నారు.