తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rajouri Encounter | ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందించిన ఆర్మీ శునకం

Rajouri encounter | ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందించిన ఆర్మీ శునకం

13 September 2023, 16:19 IST

  • జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. ఈ క్రమంలోనే ఓ జవాన్ వీర మరణం పొందారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ నిర్వహిస్తున్న క్రమంలో ఆర్మీ డాగ్ కూడా ప్రాణాలు కోల్పోయింది. సైనికుడిని కాపాడే క్రమంలో ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ శునకం చనిపోయింది. ఈ విషయాన్ని ఆర్మీ వెల్లడించింది.ఐదేళ్లుగా ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నఈ ఆర్మీ డాగ్ 'కెంట్' మృతి పట్ల ఇండియన్ ఆర్మీ సంతాపం తెలిపింది. మరోవైపు సరిహద్దుల్లో వందల మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విషయాన్ని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించిన కొన్ని గంటల్లోనే ఈ దుర్ఘటన జరిగింది.