తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు; 23 మంది సైనికులు మిస్సింగ్

Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు; 23 మంది సైనికులు మిస్సింగ్

04 October 2023, 12:01 IST

  • Sikkim: సిక్కింలో బుధవారం మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. దీంతో సైనికుల ఆచూకీ కోసం సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వారి కోసం గాలిస్తున్నారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు వెల్లువెత్తాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి తీవ్రమైంది. దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.