Delhi Chalo: రేషన్, వంటసామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు.. ఢిల్లీలో ట్రాఫిక్ ఇక్కట్లు
13 February 2024, 14:45 IST
- దేశరాజధాని ఢిల్లీ వైపు అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సర్కార్ని ప్రశ్నించేందుకు బయలుదేరారు. వేలాది ట్రాక్టర్లతో ఇప్పటికే పంజాబ్, హరియాణ రైతులు చేరుకున్నారు.ఢిల్లీలో చలో కార్యక్రమం పక్కాగా విజయవంతం చేస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో కనివిని ఎరుగని రీతిలో సెక్యూరిటీని పెట్టారు.ముళ్లకంచలు, బారీ కేట్లు పెట్టేశారు. దేశ రాజధాని వైపు కదులుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వారంతా చల్లాచెదురయ్యారు.