తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  World’s Largest Meditation Centre | కాశీలో అతిపెద్ద ధ్యాన మందిరం.. ప్రారంభించిన ప్రధాని

World’s Largest Meditation Centre | కాశీలో అతిపెద్ద ధ్యాన మందిరం.. ప్రారంభించిన ప్రధాని

18 December 2023, 16:57 IST

  • ప్రపంచంలోనే అతి పెద్దదైన ధాన్య కేంద్రాన్ని ప్రధాని మోదీ వారణాసిలో ప్రారంభించారు. ఈ ధాన్య కేంద్రాన్ని స్వర్వేద్ మహామందిర్‌గా నామకరణం చేశారు. వారణాసిలోని ఉమ్రాలోని ఈ నిర్మాణం ఉంది. ఈ స్వర్వేద్ మహామందిర్ సిటీ సెంటర్ నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భారీ నిర్మాణం 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఏడు అంతస్తుల భవనంలో నిర్మించారు. దాదాపు 3వేల 137 శ్లోకాలు ధాన్య కేంద్రంలోని గోడలపై చెక్కబడి ఉన్నాయి. ధ్యాన కేంద్రంలో దాదాపు 20,000 మంది కలిసి కూర్చుని ధ్యానం చేయవచ్చు.