తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pakistan | శారదా పీఠం కూల్చి సైనికులకు కాఫీ హౌస్‌ నిర్మించేందుకు పాక్ కుట్ర

Pakistan | శారదా పీఠం కూల్చి సైనికులకు కాఫీ హౌస్‌ నిర్మించేందుకు పాక్ కుట్ర

28 November 2023, 15:04 IST

  • పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో ఉన్న పురాతన హిందూ ఆలయాన్ని కూల్చేందుకు ఆ దేశ సర్కారు కుట్ర చేస్తోంది. పీఓకేలోని శారదా పీఠాన్ని ధ్వంసం చేసి, అక్కడ పాకిస్థాన్ సైనికులకు కాఫీ హౌస్ నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో దారా షికో ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ అమీర్ రషీద్ పాక్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునెస్కో డీజీకి లేఖ రాశారు. పీఓకే లోపల సైనికుల కోసం కాఫీ హౌస్‌ను విస్తరించడం కోసం శారదా పీఠ్‌లోని కొన్ని గోడలను పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. మహ్మద్ అమీర్ రషీద్ యునెస్కోకు రాసిన లేఖలో వ్యవస్థాగతంగా దెబ్బతిన్న మరొక ఆలయాన్ని కూడా పేర్కొన్నాడు.