Nupur Sharma : పాక్ నుంచి నుపుర్ శర్మను చంపడానికే వచ్చా!
19 July 2022, 19:20 IST
Nupur Sharma : మొహమ్మద్ ప్రవక్తను అవమానించిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మను చంపడానికి ఒక వ్యక్తి పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి అక్రమంగా భారత్లోకి చొరబడ్డారు. అతడిని జులై 16 న భద్రత దళాలు రాజస్తాన్లో అదుపులోకి తీసుకున్నాయి. నిఘా వర్గాలు ఆయనను విచారిస్తున్నాయి. నుపుర్ శర్మను చంపడానికే తాను భారత్లోకి వచ్చానని అతడు వెల్లడించారు. తన పేరు అష్రఫ్ రిజ్వాన్ అని, తనది పాక్లోని పంజాబ్ రాష్ట్రమని తెలిపాడు. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తరువాత పాకిస్తాన్లో మత పెద్దల సమావేశం జరిగిందని, ఆ సమావేశానికి హాజరైన తరువాత, నుపుర్ శర్మను హతమార్చాలని నిర్ణయిచుకున్నానని వివరించాడు. భారత్లోకి చేరుకున్న తరువాత మొదట రాజస్తాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లాలనుకున్నానని, ఆ తరువాత నుపుర్ శర్మను చంపే మిషన్ పూర్తి చేయాలనుకున్నానని వెల్లడించాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..