Neeraj Chopra | భారత అథ్లెటిక్స్ చరిత్రలో సంచలనం... పసిడి పతకం పట్టేసిన నీరజ్
28 August 2023, 12:08 IST
- టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం గెలిచిన మన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో సంచలనం సృష్టించాడు. ఇంత వరకు ఏ భారత అథ్లెట్కు సాధ్యం కాని ప్రపంచ ఛాంపియన్ రికార్డును అలవోకగా అందుకున్నాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో స్వర్ణం పతకం సాధించాడు. 88.17 మీటర్లు బల్లెం విసిరి ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి భారత ఆటగాడిగా 25 ఏళ్ల నీరజ్ చోప్రా నిలిచాడు. గతేడాది ఇదే టోర్నీలో 87.82 మీటర్లు విసిరిన నీరజ్.. రజత పతకం సాధించాడు.