తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Watch: పానీ పూరీ అమ్మిన సీఎం ... ..ఎగబడిన జనాలు!

Watch: పానీ పూరీ అమ్మిన సీఎం ... ..ఎగబడిన జనాలు!

14 July 2022, 21:17 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో పర్యటించారు. డార్జిలింగ్ వీధుల్లో తిరుగుతూ.. మాల్ రోడ్‌లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ అమ్మారు. సీఎం పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు డార్జిలింగ్ విచ్చేశారు దీది . మమతా బెనర్జీ పర్యటన దాదాపు మూడ్రోజుల పాటు ఉండనుంది