తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Himachal Pradesh: భారీ వర్షాలతో విరిగిపడుతున్న కొండచరియలు.. మూతబడ్డ రహదారులు

Himachal Pradesh: భారీ వర్షాలతో విరిగిపడుతున్న కొండచరియలు.. మూతబడ్డ రహదారులు

14 August 2023, 14:00 IST

  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొండలు విరిగిపడుతున్నాయి. దీంతో పలుచోట్ల ప్రజలు ప్రాణాలు విడిచారు. తాజాగా సిమ్లాలోని ఓ ఆలయంపై..కొండచరియలు విరిగిపడి 9మంది మృతి చెందారు. మరో 20 మంది బండరాళ్ల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీఎం సుఖ్వీందర్ పరిశీలించారు. అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు మెుత్తం రాష్ట్ర వ్యాప్తంగా వరదల దాటికి గత 24 గంటల్లో 21 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.