Indian coast guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ 'సాహసం'.. ఆ 19మంది సేఫ్
17 September 2022, 8:03 IST
Indian coast guard : మునిగిపోతున్న కార్గో నౌక ఎంటీ పార్థ్ నుంచి 19మందిని సురక్షితంగా రక్షించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం. మోర్ముగావ్ పోర్టు నుంచి 80నాటికల్ మైళ్ల దూరంలో.. లైఫ్ బోటుపై ఉండిపోయి భయం భయంతో జీవించారు ఈ 19మంది. సహాయం కోసం సిగ్నల్స్ పంపించారు. ఆ సిగ్నల్స్ అందుకుని రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం.. సాహసోపేతంగా వారిని రక్షించింది. ఆ దృశ్యాలు మీరూ చూసేయండి.