`కలాంను అనుసరించండి.. లాడెన్ను కాదు`
20 May 2022, 21:12 IST
విద్యార్థులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక విలువైన సూచన చేశారు. విద్యను ఉగ్రవాదం కోసం ఉపయోగించవద్దని సూచించారు. `అబ్దుల్ కలాంను అనుసరించండి.. ఒసామా బిన్ లాడెన్ను కాదు` అంటూ సందేశమిచ్చారు. పుణెలో డీవై పాటిల్ విద్యాపీఠ్ కాన్వొకేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ `ఇన్ఫోసిస్ కోసం పనిచేస్తున్నవారు, అల్కాయిదా కోసం పనిచేస్తున్న వారు చదువుకున్నవారే. కానీ వారు పాటించే విలువల్లోనే తేడా ఉంది. వారిలో ఒకరు సమాజ ప్రగతి కోసం పని చేస్తుంటే.. మరొకరు 9\11 దాడులకు ప్రణాళికలు వేస్తుంటారు` అని వ్యాఖ్యానించారు. ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులను కోరారు.