తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-palestine | ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం… యుద్ధంలో 3 వేలమంది మృతి

Israel-Palestine | ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం… యుద్ధంలో 3 వేలమంది మృతి

11 October 2023, 11:33 IST

  • ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం దూకుడుగా కొనసాగుతోంది. బుధవారం నాటికి ఈ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. హమాస్ పై ముప్పేట దాడి చేస్తోంది ఇజ్రాయెల్. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 3వేలకు చేరింది. ఇక ఇజ్రాయెల్ కు మరింత సాయం అందించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలతో కూడిన అమెరికా విమానం ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఇక ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతున్నాయి. హమాస్ దాడులు దుర్మార్గపు చర్యగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు.