తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Farmers 'Delhi Chalo' March | 15 వేల మంది రైతులు, 12 వందల ట్రాక్టర్లతో ఢిల్లీకి పయనం

Farmers 'Delhi Chalo' March | 15 వేల మంది రైతులు, 12 వందల ట్రాక్టర్లతో ఢిల్లీకి పయనం

21 February 2024, 16:39 IST

  • Farmers Protest: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి 'చలో ఢిల్లీకి అన్నదాతలు పిలుపునిచ్చారు. దీంతో పంజాబ్-హరియాణ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని వైపు కదులుతున్న రైతన్నలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ అన్నదాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దాదాపు 15 వేల మంది రైతులు, 12 వందల ట్రాక్టర్లు, మూడు వందల కార్లు, పది మినీ బస్సుల్లో ఢిల్లీకి పయనం అయ్యారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై రైతు సంఘాల ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు.