BJP - Sena rebels’ power sharing formula | ఫడణవీస్ సీఎం; షిండే డెప్యూటీ సీఎం
28 June 2022, 22:17 IST
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై రాజకీయ సమాలోచనలు సాగుతున్నాయి. శివసేనలోని షిండే వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారంలోకి రానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించి షిండే వర్గం, బీజేపీ మధ్య `అధికార పంపిణీ` చర్చలు కూడా సాగుతున్నాయని సమాచారం. `హిందుస్తాన్ టైమ్స్`కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. బీజేపీ తరఫున దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారు. అలాగే, రెబెల్ ఎమ్మెల్యేల లీడర్ ఏక్నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. అలాగే, మరో 11 మంత్రి పదవులు, అందులో 5 కేబినెట్ హోదా పదవులు ఇస్తామని బీజేపీ చెప్పింది. 2019లో ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు సమయంలో కూడా ఇవే ఆఫర్లను అజిత్ పవార్కు బీజేపీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అజిత్ పవార్ యూ టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా షిండే వర్గానికి అంతకుమించిన `ఆఫర్` ఉండక పోవచ్చని తెలుస్తోంది. అలాగే, 2019 మందు శివసేనతో పొత్తు సమయంలో కూడా శివసేనకు బీజేపీ ఆఫర్ చేసింది 25% మంత్రి పదవులే. ప్రస్తుతం షిండే వర్గంలో ఐదుగురు మంత్రులున్నారు. వారికి మంత్రి పదవులు ఖాయమేనని, మిగతా వారిలో ఏడుగురిని సహాయ హోదాలో అకామడేట్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..