Covid-19 | దేశంలో మళ్లీ కరోనా కేసులు.. తెలంగాణలో పాజిటివ్ కేసులు
19 December 2023, 12:37 IST
- దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూడటంతో.. ప్రజలు వైరల్ బారిన పడుతున్నారు. తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ పై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అటు కేంద్ర ఆరోగ్యశాఖ సైతం అన్నీ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.