Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్.. ఐఎన్ఎస్ చెన్నైతో రంగంలోకి దిగిన నేవీ
05 January 2024, 16:58 IST
- సోమాలియా తీరంలో భారత్ కు సరుకుతో వచ్చే కార్గో షిప్ హైజాక్కు గురైంది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగినట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు. ఒక్కసారి గుర్తు తెలియని సాయుధ సిబ్బంది షిప్ లోకి ప్రవేశించి హైజాక్ చేసినట్లు తెలిపారు. హైజాక్ కు గురైన నౌకను రక్షించేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. INS చెన్నై యుద్ధ నౌకను సంబంధిత ప్రాంతానికి పంపించింది. ఇంకొన్ని గంటల్లో ఐఎన్ఎస్ చెన్నైకి హజాక్ కు గురైన నౌకకు మధ్య లింక్ ఏర్పడుతుందని సమాచారం. ఇక అందులో మన దేశానికి చెందిన సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది.