తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ హైజాక్.. ఐఎన్ఎస్ చెన్నైతో రంగంలోకి దిగిన నేవీ

Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ హైజాక్.. ఐఎన్ఎస్ చెన్నైతో రంగంలోకి దిగిన నేవీ

05 January 2024, 16:58 IST

  • సోమాలియా తీరంలో భారత్ కు సరుకుతో వచ్చే కార్గో షిప్‌ హైజాక్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగినట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు. ఒక్కసారి గుర్తు తెలియని సాయుధ సిబ్బంది షిప్ లోకి ప్రవేశించి హైజాక్ చేసినట్లు తెలిపారు. హైజాక్ కు గురైన నౌకను రక్షించేందుకు ఇండియన్​ నేవీ రంగంలోకి దిగింది. INS​ చెన్నై యుద్ధ నౌకను సంబంధిత ప్రాంతానికి పంపించింది. ఇంకొన్ని గంటల్లో ఐఎన్​ఎస్​ చెన్నైకి హజాక్ కు గురైన నౌకకు మధ్య లింక్​ ఏర్పడుతుందని సమాచారం. ఇక అందులో మన దేశానికి చెందిన సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది.