తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bihar Bandh: బీహార్‌లో ఆగని ఆందోళనలు.. కొనసాగుతున్న ఆందోళనకారుల విధ్వంసం

Bihar bandh: బీహార్‌లో ఆగని ఆందోళనలు.. కొనసాగుతున్న ఆందోళనకారుల విధ్వంసం

28 January 2022, 16:27 IST

బీహార్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే బోర్డు ప‌రీక్షలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు నిర‌స‌న‌గా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్ బంద్‌‌కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపుకు విద్యార్థులు భారీగా స్పందించారు. రోడ్లను బ్లాక్ చేయడంతో పాటు పలు చోట్ల స్టూడెంట్స్ విధ్వంసానికి పాల్పడ్డారు. జ‌న‌వ‌రి 15వ తేదీన రైల్వే బోర్డు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష ఫ‌లితాల‌ు విడుదల చేయగా.. వాటిలో గోల్‌మాల్ జ‌రిగాయని ఆరోపించిన విద్యార్థులు కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో ఆందోళ‌న‌లు చేస్తున్నారు. గ‌యాలో రెండు రోజుల క్రితం ఆందోళ‌న‌కారులు ఓ రైలుకు నిప్పుపెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.