తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Police Action: న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసుల సోదాలు

Delhi Police action: న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసుల సోదాలు

03 October 2023, 14:17 IST

  • Raids on NewsClick: న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టులు,ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల సందర్భంగా జర్నలిస్టులు, ఉద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. న్యూస్‌క్లిక్ సంస్థపై చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. చైనా పౌరుడు నెవిల్ రాయ్ సింఘమ్ నుంచి రూ.38 కోట్లు తీసుకున్నట్లు, తద్వారా భారతదేశంలో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు న్యూస్‌క్లిక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు సోదాలు జరిపిన వారిలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టు అభిసార్ శర్మ కూడా ఉన్నారు. అతను ట్విటర్ లో సోదాల గురించి వెల్లడించారు.