Godavari Express Accident : గోదావరి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు….
15 February 2023, 12:50 IST
- విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్నGodavari Express Derailed గోదావరి ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గోదావరి ఎక్స్ప్రెస్కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టు గుర్తించారు. మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటుండగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఉదయం 6.10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సమీపంలో ట్రైన్ పట్టాలు తప్పింది. గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో కాజీపేట-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రికి కాని ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కాదని దక్షిణ మధ్య రైల్వే జిఎం స్పష్టం చేశారు.