Bandi Sanjay On KCR : ప్రధాని హైదరాబాద్ వస్తే కేసీఆర్ ఎక్కడికి వెళ్లాడు..?
09 April 2023, 15:35 IST
- BJP vs BRS : ప్రధాని మోదీ సికింద్రాబాద్ సభకు సీఎం కేసీఆర్ గైర్హాజరు కావటంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రధాని తెలంగాణకు వస్తే.. సీఎం హాజరు కాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్కు అంత ముఖ్యమైన పని ఏంటో చెప్పాలని.. డిమాండ్ చేశారు. కేంద్రాన్ని తిట్టడమే పని పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నియంత పాలన దించాలని పిలుపునిచ్చారు.