Women Buried : శ్రీకాకుళంలో అమానుషం... తల్లి కూతురిని పూడ్చేశారు...!
10 November 2022, 13:10 IST
- women buried in srikakulam: శ్రీకాకుళం జిల్లా హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లి(దాళమ్మ) కూతురి(సావిత్రి)ని సజీవ సమాధి చేసేందుకు బంధువులు యత్నించారు. స్థలం ఆక్రమణపై ప్రశ్నించినందుకు మూడు ట్రాక్టర్లతో మట్టి కుమ్మరించి హత్యాయత్నం చేశారు. ఆ మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.