Nara Lokesh: బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఆ సామాజిక వర్గాలతో సమావేశం
29 December 2023, 13:31 IST
- 2024 జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తామని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. పోలీసు అధికారులు రఘు రామరెడ్డి , సీతా రామాంజనేయులు చట్టాన్ని ఉల్లంఘించారని ఒప్పుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఎర్ర బుక్కులో పేర్లు అంటే భయం ఎందుకని అడిగారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమని లోకేష్ అన్నారు.