తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bus Accident: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి

Bus Accident: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి

06 November 2023, 12:00 IST

  • విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండులో ప్లాట్ ‌ఫాంపై‌కి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆటోనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరు వెళ్లాలి. ఉదయమే ఆటోనగర్‌ డిపో నుంచి బయల్దేరిన ఆ ఏసీ బస్సు నేరుగా నెహ్రూ బస్టాండ్‌కు వచ్చింది. గుంటూరు ప్లాట్‌ ఫాంంపై‌ దగ్గర ఆపేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఔట్ సోర్సింగ్ కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, మరొకరు మృతిచెందారు.