తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi Tirumala Tour | తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ

PM Modi Tirumala Tour | తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ

27 November 2023, 11:25 IST

  • తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. కార్తీక సోమవారం వెంకన్నకు ప్రత్యేక పూజలు మోదీ చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదపండితులు మోదీకి ఆశీర్వాదాలు అందించారు. తిరుమల దర్శనార్థం ఆదివారం రాత్రి 8.16 గంటలకు తిరుమలలోని రచన విశ్రాంతి భవనానికి ప్రధాని చేరుకున్నారు. ప్రధాని ఆలయ ప్రవేశానికి గంట ముందే క్యూలైన్లను నిలిపివేశారు. ప్రధాని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రధానితో పాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తిరుమలకు చేరుకున్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి ఆదివారం రాత్రి రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.