Nara Lokesh: దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్యపై సీబీఐ విచారణ వేస్తాం
04 December 2023, 12:51 IST
- దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిశారు. సుబ్రమణ్యం హత్యపై విచారణ జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును సీబీఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు, హత్య వెనుక ఉన్న వారందరికీ శిక్ష పడేలా చేస్తామని అన్నారు. అటు కోడి కత్తి శీను అన్న లోకేష్ వద్ద మాట్లాడారు. తమ కుటుంబాన్ని జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. జగన్ ఎందుకు కోర్టుకు హాజరు కావటం లేదని ప్రశ్నించారు.