తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nara Lokesh Yuvagalam | యువగళం యాత్రలో కలిసిన నారా, నందమూరి కుటుంబాలు

Nara Lokesh YuvaGalam | యువగళం యాత్రలో కలిసిన నారా, నందమూరి కుటుంబాలు

18 December 2023, 15:53 IST

  • తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ఈ యాత్ర ముగియనుంది. చివరి రోజు యాత్ర కావటంతో..నారా, నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ కలిసి పాదయాత్ర చేశారు. విశాఖ శివాజీనగర్‌లో ప్రారంభించిన 226వ యువగళం పాదయాత్రలో లోకేశ్‌తోపాటు తల్లి భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబసభ్యులు కలిసి నడిచారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రారంభమైన యువగళంయాత్ర.. 97 నియోజకవర్గాల్లో సాగింది. 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ కోసం టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.