తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indrakiladri: మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరీగా అమ్మవారి దర్శనం

Indrakiladri: మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరీగా అమ్మవారి దర్శనం

23 October 2023, 10:07 IST

  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఇవాళ రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మహిషాసురమర్ధినిగా..మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారు. అటు సాయంత్రం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారికి హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇప్పటికే తెప్పోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.