Palnadu District : చంద్రబాబు మాచర్ల పర్యటన నేపథ్యంలో బాంబులు, కత్తులు కలకలం
08 May 2024, 16:25 IST
- పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో నిర్మాణంలో ఉన్న ఇంటిలో బాంబులు,కత్తులు,వేట కొడవళ్లు కలకలం రేపాయి. 17 బాంబులు,3 వేట కొడవల్లు,3 బరిసెలు,ఒక చిప్ప గొడ్డలి,ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11 న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాచర్ల పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబుల,కత్తులు దాచిఉంచడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.