తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Andhra Pradesh | ప్రజల దగ్గరకు వెళ్లడానికి మీ అనుమతి కావాలా.. బిత్తరపోయిన పోలీస్!

Andhra Pradesh | ప్రజల దగ్గరకు వెళ్లడానికి మీ అనుమతి కావాలా.. బిత్తరపోయిన పోలీస్!

11 December 2023, 10:59 IST

  • తెలుగుదేశం పార్టీ తరపున ప్రజల వద్దకి వెళ్తున్న పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మి నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి తీసుకోలేదని.., ప్రజల వద్దకి వెళ్లేందుకు వీలు లేదని అక్కడి వచ్చిన ఎస్ఐ చెప్పారు. మరి మంత్రి ప్రజల్లోకి వెళ్లినప్పుడు పోలీసుల వద్ద అనుమతి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీంతో.. ఆ ఎస్ఐ సమాధానం చెప్పలేదు. ప్రజల దగ్గరకు వెళ్లడానికి మీ అనుమతి కావాలా నిలదీశారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మీ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ఎస్ఐ వెళ్లిపోయారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరని, అలాగే ఇటువంటి బెదిరింపులతో తెలుగుదేశం విజయం ఆపలేరని స్పష్టం చేశారు.