Vizianagaram: మాటలకు అందని విషాదం.. 14 మంది మృతి; వందల మందికి గాయలు
30 October 2023, 10:13 IST
- ఒడిశాలో ప్రమాదం గురుతులు ఇంకా మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. కంటకాపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్పై ఉన్న ప్యాసింజర్ రైలును వెనుకనుంచి వచ్చిన విశాఖ-రాయగడ ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్పైకి బోగీలు ఎగిరిపడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి.