CM Jagan | విశాఖ కోసం నేనొక్కడినే పోరాడుతున్నా.. ఇక్కడే ప్రమాణం స్వీకారం చేస్తా, పరిపాలన కూడా..!
05 March 2024, 14:22 IST
- రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల తర్వాత తాను విశాఖలో నివసిస్తానని మరోసారి చెప్పిన సీఎం జగన్ చెప్పారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ది, ఏపీలో అవకాశాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదన్న జగన్, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందన్నారు. విశాఖలో లక్ష కోట్లు ఖర్చుపెట్టి, అమరావతి లాంటి కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు.