CM Jagan Bus Yatra : ఎన్టీఆర్ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర.. జగన్ సెక్యూరిటీ టైట్
15 April 2024, 11:42 IST
- సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ పునర్ ప్రారంభమైంది. శనివారం రాయిదాడితో జగన్ కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కేసరపల్లి దగ్గర నడుస్తోంది. ఇటు నుంచి గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు బస్సు యాత్ర చేసుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు.