తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada | ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? జగనన్నని నిలదీసిన వైఎస్ షర్మిల

Vijayawada | ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? జగనన్నని నిలదీసిన వైఎస్ షర్మిల

22 February 2024, 13:45 IST

  • కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్ పై ఆ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా? అని షర్మి ల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. గురువారం ‘చలో సెక్రటేరియట్’కు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లోనే షర్మి ల నిద్రించారు. అయితే ఈ ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి నిర్బంధించారు. అనంతరం అక్కడే ధర్నాకు కూర్చున్న షర్మిల.. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డికి... జగన్ కి ఏ మాత్రం పోలిక లేదని అన్నారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీని ఈ ప్రభుత్వం ఇచ్చిందని షర్మిల మండిపడ్డారు.