ap mlc sheikh sabji | రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి
15 December 2023, 14:54 IST
- ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అక్కడికక్కడే చనిపోయారు. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.