Mlc Car Road Accident | రోడ్డు ప్రమాదంలో పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు
05 January 2024, 11:05 IST
- తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ Mlc పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలోకి రాగానే Mlc కారుకు ముందు వెళ్తున్న లారీ టైరు పంక్చరు అయ్యింది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్పై పడిపోయింది. ఈ ఘటనలో చంద్రశేఖర్రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా, Mlc తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కారులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎమ్మెల్సీని తన కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.