తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nandyala | నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ దంపతుల దుర్మరణం!

Nandyala | నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నవ దంపతుల దుర్మరణం!

06 March 2024, 11:02 IST

  • నంద్యాల జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.