Afghanistan: ‘డెత్ టూ పాకిస్థాన్’ అంటూ అఫ్గాన్ల నినాదాలు.. ఎందుకంటే..!
22 November 2022, 20:54 IST
Afghanistan: సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్కు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అఫ్గానిస్థాన్లోని పకిటియా ప్రావిన్స్ లో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. తమ దేశ సైన్యం, ప్రజలపై పాకిస్థాన్ సైన్యం ప్రవర్తిస్తున్న తీరును నిరసించారు. డెత్ టూ పాకిస్థాన్ (పాకిస్థాన్కు మరణం) అంటూ అఫ్గాన్లు నినదించారని అక్కడి మీడియా వెల్లడించింది. దేశ సరిహద్దు వద్ద పాకిస్థాన్తో పోరాడుతున్న తాలిబన్లకు అప్ఘాన్ ప్రజలు మద్దతు పలుకుతున్నారు. డూరండ్ సరిహద్దు వద్ద.. తాలిబన్లు, పాకిస్థాన్ సేనల మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఇరు వైపుల ప్రాణనష్టం జరిగింది. అనేక మందికి గాయాలయ్యారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.