Navaratri 7th Day : నవరాత్రులలో ఏడో రోజు.. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అవతార విశిష్టత
21 October 2023, 5:00 IST
- Navaratri 7th Day 2023 : దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అవతార విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దుర్గా మాత
దేవీ నవరాత్రులలో ఏడో రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి, శనివారం రోజున మణిద్వీపవాసిని అయిన పరాంబికను శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో పూజలు జరుపుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. త్రిపురత్రయంలో రెండవశక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని లలిత పంచమి అని కూడా అంటారు.
లేటెస్ట్ ఫోటోలు
చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తు ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కోసం, ముత్తైదువులు దీర్హ సుమంగళిగా అఖండ సౌభాగ్యం కోసం ఈ నవరాత్రులలో ఏడో రోజు ఉపాంగ లలితావ్రతం ఆచరిస్తారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అమ్మవారిని శ్రీ లలితాదేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులను పిలిచి, సువాసినీ పూజలు చేస్తారు. కైలాస గౌరీ నోము కాని, గ్రామ కుంకుమ నోము కాని నోచుకున్న వారు చాలామంది ఈరోజు ఉద్యాపన చేసుకుంటారు. కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారని చిలకమర్తి తెలిపారు.
బొమ్మలకొలువులు పెట్టుకున్నవారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితాదేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు చేసేవారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమినాడు శ్రీలలితాదేవి దేదీష్యమైన మూర్తిని మనస్సులో అనుకుని ఓం ఐం హ్రీం, శ్రీం శ్రీ మాత్రే నమః అని వీలైననిసార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తియై చల్లగా చూస్తుందని ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు. ఈరోజు ధరించవలసిన వర్ణం బంగారు రంగు. అమ్మవారికి నివేదనగా పులిహోర, పెసర బూరెలు సమర్పిస్తారు.