తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం

Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం

17 April 2024, 20:39 IST

Tirumala : తిరుమలలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నప‌న తిరుమంజ‌నం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

  • Tirumala : తిరుమలలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నప‌న తిరుమంజ‌నం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
(1 / 6)
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. 
(2 / 6)
శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. 
తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  
(3 / 6)
తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  
(4 / 6)
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  
టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ చేశారు.  కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 
(5 / 6)
టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ చేశారు.  కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 
ఒంటిమిట్ట ఉత్సవాల్లో ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం నిర్వహించనున్నారు. 
(6 / 6)
ఒంటిమిట్ట ఉత్సవాల్లో ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం నిర్వహించనున్నారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి