తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Congress Campaign: ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్; మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ తో ప్రజల్లోకి..

Congress Campaign: ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్; మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ తో ప్రజల్లోకి..

06 April 2024, 17:40 IST

2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసిన పార్టీ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభలను నిర్వహించి, మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తోంది. శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్ లో  బహిరంగ సభ నిర్వహించింది.

  • 2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేసిన పార్టీ.. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభలను నిర్వహించి, మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తోంది. శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్ లో  బహిరంగ సభ నిర్వహించింది.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు శనివారం జైపూర్ లో ర్యాలీ నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర'ను ఆవిష్కరించారు. 
(1 / 7)
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు శనివారం జైపూర్ లో ర్యాలీ నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర'ను ఆవిష్కరించారు. (ANI)
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం జైపూర్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు 'కాంగ్రెస్ మేనిఫెస్టో'ను ఆవిష్కరించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.
(2 / 7)
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం జైపూర్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు 'కాంగ్రెస్ మేనిఫెస్టో'ను ఆవిష్కరించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.(ANI)
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత జైపూర్ బహిరంగ ర్యాలీ జరిగింది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం చట్టపరమైన హామీ, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి పైగా పెంచడానికి రాజ్యాంగ సవరణ వంటి హామీలు ఉన్నాయి. 
(3 / 7)
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత జైపూర్ బహిరంగ ర్యాలీ జరిగింది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం చట్టపరమైన హామీ, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి పైగా పెంచడానికి రాజ్యాంగ సవరణ వంటి హామీలు ఉన్నాయి. (PTI)
పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ లో 'యువ న్యాయ్', 'నారీ న్యాయ్', 'కిసాన్ న్యాయ్', 'శ్రామిక్ న్యాయ్', 'హిస్సేదారీ న్యాయ్' అనే ఐదు విభాగాల్లో హామీలను కాంగ్రెస్ ప్రకటించింది.
(4 / 7)
పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ లో 'యువ న్యాయ్', 'నారీ న్యాయ్', 'కిసాన్ న్యాయ్', 'శ్రామిక్ న్యాయ్', 'హిస్సేదారీ న్యాయ్' అనే ఐదు విభాగాల్లో హామీలను కాంగ్రెస్ ప్రకటించింది.(PTI)
‘‘నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. మా మేనిఫెస్టోకు 'న్యాయ్ పత్ర' అని పేరు పెట్టాం. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల తర్వాత మనం మర్చిపోయే ప్రకటనల జాబితా మాత్రమే కాదు, ఇది న్యాయం కోరుకునే జాతి గొంతుక’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. 
(5 / 7)
‘‘నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. మా మేనిఫెస్టోకు 'న్యాయ్ పత్ర' అని పేరు పెట్టాం. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల తర్వాత మనం మర్చిపోయే ప్రకటనల జాబితా మాత్రమే కాదు, ఇది న్యాయం కోరుకునే జాతి గొంతుక’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. (PTI)
దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపి, ఈమెయిల్ ద్వారా, 'ఆవాజ్ భారత్ కీ' పోర్టల్ ద్వారా వేలాది సూచనలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
(6 / 7)
దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపి, ఈమెయిల్ ద్వారా, 'ఆవాజ్ భారత్ కీ' పోర్టల్ ద్వారా వేలాది సూచనలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. (PTI)
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఏప్రిల్ 5న ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది. 
(7 / 7)
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఏప్రిల్ 5న ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి