తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kangana Ranaut : 15ఏళ్లకే ఇంట్లో నుంచి పారిపోయిన కంగనా రనౌత్​!

Kangana Ranaut : 15ఏళ్లకే ఇంట్లో నుంచి పారిపోయిన కంగనా రనౌత్​!

25 March 2024, 17:20 IST

ప్రముఖ నటి కంగనా రనౌత్​ పేరు మళ్లీ వార్తలకెక్కింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై ఆమె పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కంగన గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..

  • ప్రముఖ నటి కంగనా రనౌత్​ పేరు మళ్లీ వార్తలకెక్కింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై ఆమె పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కంగన గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..
లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాను భారతీయ జనతా పార్టీ తాజాగా విడుదల చేసింది. నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్​లోని మండి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​కి చెందిన కంగనా,, భంబ్లాలో జన్మించారు, 2006 థ్రిల్లర్ గ్యాంగ్​స్టర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు, దీనికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు లభించింది.
(1 / 7)
లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాను భారతీయ జనతా పార్టీ తాజాగా విడుదల చేసింది. నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్​లోని మండి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​కి చెందిన కంగనా,, భంబ్లాలో జన్మించారు, 2006 థ్రిల్లర్ గ్యాంగ్​స్టర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు, దీనికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు లభించింది.
కంగనా రనౌత్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటున్నారు. తరచూ అభిమానులతో.. తన చిన్ననాటి ఫోటోలను పంచుకుంటున్నారు. ఫిబ్రవరి 19, 2023న హిమాచల్ ప్రదేశ్​లో.. తన పాఠశాల రోజులకు సంబంధించిన కొన్ని ఫోటోలను కంగనా షేర్ చేశారు. 'ఈ ఫొటోలన్నీ శర్మ అంకుల్ తీసినవే. అతను నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు," అని రాసుకొచ్చారు కంగన.
(2 / 7)
కంగనా రనౌత్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటున్నారు. తరచూ అభిమానులతో.. తన చిన్ననాటి ఫోటోలను పంచుకుంటున్నారు. ఫిబ్రవరి 19, 2023న హిమాచల్ ప్రదేశ్​లో.. తన పాఠశాల రోజులకు సంబంధించిన కొన్ని ఫోటోలను కంగనా షేర్ చేశారు. 'ఈ ఫొటోలన్నీ శర్మ అంకుల్ తీసినవే. అతను నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు," అని రాసుకొచ్చారు కంగన.
కంగనా రనౌత్ 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయారట. అంతేకాదు.. డ్రగ్స్​కి బానిసైన రోజులు కూడా ఉన్నాయట. ఈ విషయాల్ని ఆమె చాలా సార్లు చెప్పుకొచ్చారు. టీనేజ్​లో ముంబైకి వెళ్లిన కంగనా 2006లో ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన గ్యాంగ్ స్టర్: ఎ లవ్ స్టోరీ చిత్రంలో ప్రధాన పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ (2008), వన్స్ అప్పాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయి (2010), తనూ వెడ్స్ మను (2011) వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. క్వీన్ (2014) చిత్రంలో నటించినందుకు కంగనా విమర్శకుల ప్రశంసలు పొందారు.
(3 / 7)
కంగనా రనౌత్ 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయారట. అంతేకాదు.. డ్రగ్స్​కి బానిసైన రోజులు కూడా ఉన్నాయట. ఈ విషయాల్ని ఆమె చాలా సార్లు చెప్పుకొచ్చారు. టీనేజ్​లో ముంబైకి వెళ్లిన కంగనా 2006లో ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన గ్యాంగ్ స్టర్: ఎ లవ్ స్టోరీ చిత్రంలో ప్రధాన పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ (2008), వన్స్ అప్పాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయి (2010), తనూ వెడ్స్ మను (2011) వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. క్వీన్ (2014) చిత్రంలో నటించినందుకు కంగనా విమర్శకుల ప్రశంసలు పొందారు.
కంగనా రనౌత్ ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించారు. కానీ ఇటీవలికాలంలో తలైవి (2021), చంద్రముఖి 2 (2023) వంటి కొన్ని తమిళ చిత్రాలలోనూ నటించారు. ఆమె నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ అవార్డులు, స్క్రీన్, జీ సినీ, సైమా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డుల వేడుకల నుంచి ఒక్కొక్క అవార్డును గెలుచుకున్నారు. 2021 లో, కంగనా తన నాల్గొవ జాతీయ చలనచిత్ర అవార్డును స్వీకరించిన తరువాత తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నటించిన పంగా, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
(4 / 7)
కంగనా రనౌత్ ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించారు. కానీ ఇటీవలికాలంలో తలైవి (2021), చంద్రముఖి 2 (2023) వంటి కొన్ని తమిళ చిత్రాలలోనూ నటించారు. ఆమె నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ అవార్డులు, స్క్రీన్, జీ సినీ, సైమా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డుల వేడుకల నుంచి ఒక్కొక్క అవార్డును గెలుచుకున్నారు. 2021 లో, కంగనా తన నాల్గొవ జాతీయ చలనచిత్ర అవార్డును స్వీకరించిన తరువాత తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నటించిన పంగా, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
కంగనా రనౌత్ తరచూ దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేస్తుంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్​ని అనుసరిస్తారు. వారు కలిసిన ఫోటోలను ఆమె తరచూ పోస్ట్ చేస్తూ ఉంటారు.
(5 / 7)
కంగనా రనౌత్ తరచూ దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేస్తుంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్​ని అనుసరిస్తారు. వారు కలిసిన ఫోటోలను ఆమె తరచూ పోస్ట్ చేస్తూ ఉంటారు.
2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనేక మంది ప్రముఖులలో కంగనా రనౌత్ ఒకరు. ఆ సమయంలో కొత్తగా నిర్మించిన ఆలయం ముందు దిగిన పలు ఫోటోలను ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.
(6 / 7)
2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనేక మంది ప్రముఖులలో కంగనా రనౌత్ ఒకరు. ఆ సమయంలో కొత్తగా నిర్మించిన ఆలయం ముందు దిగిన పలు ఫోటోలను ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.
కంగనా రనౌత్ చేసిన ‘అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడంతో పాటు రచన కూడా చేశారు. అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన మరుసటి రోజే కంగనా తన రాబోయే చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. 'జూన్ 14, 2024.ఈ సినిమా విడుదలకానుంది.
(7 / 7)
కంగనా రనౌత్ చేసిన ‘అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడంతో పాటు రచన కూడా చేశారు. అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన మరుసటి రోజే కంగనా తన రాబోయే చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. 'జూన్ 14, 2024.ఈ సినిమా విడుదలకానుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి