G20 Summit in New Delhi| జీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ రాకపోవటం జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం చూపదు
04 September 2023, 13:38 IST
- భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా జీ 20 సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు భారీగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వంటకాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావటం లేదు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు రాకపోవటం నిరాశ కలిగిందన్నారు. మరోవైపు భారత్ సైతం స్పందించింది. ఇద్దరు నేతలు రాకపోవటం వల్ల సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.