తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deepavali 2023 : దీపావళికి 13 దీపాలను ఎక్కడ వెలిగించాలి? ఎందుకు?

Deepavali 2023 : దీపావళికి 13 దీపాలను ఎక్కడ వెలిగించాలి? ఎందుకు?

Anand Sai HT Telugu

12 November 2023, 7:31 IST

    • Diwali 2023 : దీపావళి అంటేనే దీపాల పండగ. ఈ పండగ పూట వెలుగులతో ఇల్లు ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. అయితే 13 దీపాలను కొన్ని ప్రదేశాల్లో వెలిగించాలి. దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
దీపావళి
దీపావళి

దీపావళి

పండుగలు మన ఆచార సంప్రదాయాలకు ప్రతీకలు. కానీ ఇప్పుడు పండుగలు అంటే.. సోషల్‌ మీడియాలో కంటెంట్‌ లెక్క మారిపోయింది. పండుగ రోజు మనకు ఇష్టమైనవి వండుకోని వాటిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. ఎంత అందంగా, ఎన్ని ఎక్కువ ఐటమ్స్‌ పెడితే అంత బాగా పండుగ చేసుకున్నాం అని అనుకుంటున్నారు. దీపావళికి కూడా ఇళ్లంతా దీపాలు పెట్టి, లైటింగ్స్‌తో నింపేసి ఒక వీడియో తీసి మంచి మ్యూజిక్‌ వేసి పెడితే ఖతమ్‌..చూసేవాళ్లు అరే వీళ్లు భలే సెలబ్రేట్‌ చేసుకున్నారు అనుకోవాలి. ఇలానే చేస్తారు చాలా మంది. 13 దీపాలను వెలిగించే పద్ధతిని చాలా మంది మరిచిపోయారు.

అసలు దీపావళి పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఈ పండుగకు 13 దీపాలు వెలిగించే సంప్రదాయం ఉందని మీకు తెలుసా..? ఆ 13 దీపాలు ఎక్కడ వెలిగించాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? ఈ విషయాలు తెలుసుకుని ఆ విధంగా దీపాలు పెడితేనే కదా.. మన ఇంటికి సరిసంపదలు వచ్చేది, పండుగ ఫలితం దక్కేది.

దీపావళి రోజున, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందున అయోధ్య నగరం మొత్తం దీపాలతో అలంకరించబడింది. దీపం వెలిగించడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, చాలా అదృష్టమని చెబుతారు. దీపావళి సందర్భంగా 13 దీపాలను వెలిగించి ఇంటిలో పెట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం. ఇలా వెలిగించడం వల్ల కుటుంబంలో అకాల మరణం నుండి రక్షణ లభిస్తుంది.

దీపావళి నాడు 13 దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత:

ఇంటి వాకిట్లో దీపాలను వెలిగించాలి.

తర్వాత దీపావళి రోజు రాత్రి ఇంటి దేవుడి గదిలో దీపం వెలిగించాలి. దీనివల్ల శుభం కలుగుతుంది.

లక్ష్మీదేవికి మరో దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఐశ్వర్యం, శ్రేయస్సు, విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

ఇంట్లో తులసిలో నాలుగో దీపం వెలిగించాలి. తులసి మొక్కపై దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి చేకూరుతుంది.

దీపావళి నాడు ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించాలి. తలుపు వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషం కలుగుతుందని చెబుతారు.

దీపావళి నాడు దీపాలు వెలిగించే సమయంలో, పుష్పించే చెట్టు దగ్గర కూడా వెలిగించాలి. హిందూమతంలో పుష్పించే చెట్టుకు గౌరవప్రదమైన స్థానం ఉంది. ఈ వృక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు అని నమ్ముతారు. కాబట్టి వికసించే చెట్టుపై దీపం వెలిగిస్తే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ఏ గుడిలోనైనా ఏడో దీపం వెలిగించాలి.

డస్ట్ బిన్ దగ్గర ఎనిమిదో దీపం వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తి, దుష్టశక్తుల నుండి ఇంటిని రక్షిస్తుంది.

దీపావళి నాడు ఇంటి టాయిలెట్ దగ్గర కూడా దీపం వెలిగించాలి. టాయిలెట్ దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే టాయిలెట్ బయట వెలిగించాలి అన్నమాట.

ఇంటి పైకప్పు మీద దశమి దీపం వెలిగించాలి. ఈ దీపం ప్రతికూల శక్తి నుండి రక్షణను అందిస్తుంది.

ఇంట్లోని చెడు శక్తి పోవాలంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఇంటి కిటికీ దగ్గర దీపం వెలిగించాలి.

ఇంటి పై అంతస్తులో పన్నెండో దీపం వెలిగించాలి. దీంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పదమూడో దీపాన్ని ఇంటి కూడలిలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటింటా దీపపు కాంతి ప్రసరించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

తదుపరి వ్యాసం