Bandi Sanjay: పైసలు లేవంటున్నారు, రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్
23 April 2024, 12:08 IST
- Bandi Sanjay: తరుగు, తాలు, తేమతో సంబంధం లేకుండా ప్రతి గింజనూ కొంటామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ నేతలు.. రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, 30 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్
Bandi Sanjay: తాలు, తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తే తెలంగాణలో Paddy ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, క్వింటాకు రూ.500 బోనస్ Bonus ఇస్తే రూ.5 వేల కోట్ల అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని బండి సంజయ్ చెప్పారు.
రైతుల Farmers కోసం రూ.5,700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాంగ్రెస్ నాయకులు పైసలు లేవని అంటున్నారని, అలాంటప్పుడు 30 వేల కోట్ల ఖర్చుతో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని మండిపడ్డారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సోమవారం బండి సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పాటు దేవుళ్ల మీద ఒట్టేసి తరుగు, తాలు, తేమతో సంబంధం లేకుండా ప్రతి గింజను కొంటామనిCongress Govt కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు.
తడిచిన ధాన్యం నెపంతో 6 నుంచి 10 కిలోల కోత పెడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు బైబిల్, భగవద్గీత, ఖురాన్ దేవుళ్ల మీద కాంగ్రెస్ నేతలకు విశ్వాసం ఉన్నట్టా! అని ప్రశ్నించారు. రైతు సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం పవిత్ర గ్రంథాలను అవమానపరిచినట్టేనన్నారు.
తడిచిన ప్రతి గింజనూ కొనాలి…
అకాల వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిందని, రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిన Paddy Procurement బాధ్యత ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ధాన్యం తడిసిందని తెలిసిన వెంటనే దళారులు ఆరు నుంచి 10 కిలోల వరకు కోత పెడుతున్నారని, ప్రభుత్వం దీనిపై సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు తాలు లేకుండా చేసినా క్వింటాకు ఆరు కిలోల వరకు కోత పెడుతున్నారని, కానీ ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. గంపగుత్తగా 6 కిలోల కోత అనేది రైతులకు అలవాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన ప్రతిగింజనూ కొనాలని, బైబిల్, ఖురాన్, భగవద్గీతలపై నమ్మకం ఉంటే.. వాటిలో దేవుడు కనపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం…
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగంగానే కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర కేవలం 1,310 మాత్రమే ఉండేదని, గత పదేండ్ల పాలనలో మద్దతు ధరను 2,200కు పెంచారని అన్నారు.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డీ విరిచేస్తున్నాయని మండిపడ్డారు. యూరియా, డీఏపీ లాంటి ఎరువులకు సబ్సిడీలు ఇచ్చేది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, మోదీ మరోసారి ప్రధాని కాకుంటే సబ్సిడీలను ఎత్తివేసే ప్రమాదం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తద్వారా ఒక్కో రైతుపై ఎకరాకు 22 వేలకుపైగా అదనపు భారం పడే అవకాశం ఉందని, రైతుల ఇబ్బందులు తొలగాలంటే కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్నే తీసుకురావాలని పిలుపునిచ్చారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)