గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా కాసేపటి క్రితం భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్ట్ సిరీస్లో జరిగిన రెండు మ్యాచ్ ల్లో భారత్, ఇంగ్లాండ్ చెరొకటి గెలిచాయి. ఇక రాజ్ కోట్ లో ఇరు దేశాల అభిమానులు సందడి చేస్తున్నారు. కోహ్లీ లేకపోయిన, ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు. ఇక మ్యాచ్ గెలుపుపై ఇరు జట్లు విశ్వాసంతో ఉన్నారు.