Sheikh Hasina dances | బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా డాన్స్ చేశారు. రాజస్తానీ స్థానిక కళాకారులతో కలిసి కాసేపు చిందేశారు. నమ్మశక్యంగా లేదు కదా? ఈ వీడియో చూసేయండి ముందు..!
నాలుగు రోజుల పర్యటనకు గానూ షేక్ హసీనా భారత్ కు మంగళవారం వచ్చారు. గురువారం రాజస్తాన్ కు వచ్చారు. అక్కడి ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ను సందర్శించారు. జైపూర్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులతో పాటు స్థానిక కళాకారులు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలుకుతూ సంప్రదాయ నాట్యం చేస్తున్న ఆ రాజస్తానీ కళాకారులతో కలిసి కాసేపు బంగ్లాదేశ్ పీఎం కూడా కొన్ని స్టెప్ట్ వేశారు. ఆ తరువాత, వారితో కలిసి ఫొటోలు దిగారు.